సూర్యాపేట పట్టణంలో అద్భుతంగా నిర్మించిన మహాప్రస్థానంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం ప్రగతి కార్యక్రమానికి హైలెట్గా నిలిచింది. అబ్బురపరిచే నిర్మాణాలు, చుట్టూ గ్రీనరీ నడుమ అసలు మహాప్రస్థానంలోనే ఉన్నామా? అన్నంత ఆశ్చర్యం వేసింది.
బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలు, కళాకారుల ఆటాపాటలతో సరికొత్త వాతావరణం నెలకొంది. మంత్రి జగదీశ్రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ సూర్యాపేట మహా ప్రస్ధానం ఒక ఐకాన్గా నిలబడుతుందని పేర్కొన్నారు.