యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కేసీఆర్ బర్త్డే వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
అందులో భాగంగా ఆలేరు పట్టణ కేంద్రంలో మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అన్నదానం కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఆలేరు మున్సిపల్ చేర్మెన్ వస్పరి శంకరయ్య తదితరులు ఉన్నారు.