మిర్యాలగూడటౌన్, నవంబర్ 28 : పట్టణంలోని రామచంద్రగూడెంలో నిర్వహిస్తున్న టీఎస్ యూటీఎఫ్ జిల్లా మహాసభల్లో సోమవారం 33 తీర్మానాలను ప్రతినిధుదులు ఆమోదించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది, పారిశుధ్య సిబ్బందిని నియమించాలని కోరారు. సభ ముగింపు సందర్భంగా జిల్లా కమిటీని ఎన్నుకోనున్నట్లు సంఘం అధ్యక్షుడు ఎడ్ల సైదులు తెలిపారు. సభలో సంఘం రాష్ట్ర కార్యదర్శులు రాజశేఖర్రెడ్డి, నాగమణి, జిల్లా ప్రధానకార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులు బక్కా శ్రీనివాసాచారి, అరుణ, కోశాధికారి శేఖర్రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నల్ల నరసింహ, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.
టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యవర్గాన్ని సోమవారం జిల్లా మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎడ్ల సైదులు, ప్రధానకార్యదర్శిగా పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులుగా బక్కా శ్రీనివాసాచారి, బి.అరుణ, కోశాధికారిగా నర్రా శేఖర్రెడ్డి, జిల్లా కార్యదర్శులుగా సీహెచ్. రామలింగయ్య, వి.రాజు, జి.నరసింహ, ఎం. శ్రీనివాస్రెడ్డి, కె. విజయలక్షి, జి.అరుణ, వై.మధుసూదన్రెడ్డి, వై.శ్రీనివాస్, నలపరాజు వెంకన్న, ఎం. చిన వెంకన్న, యాదగిరి ఎన్నికయ్యారు.