మర్రిగూడ, డిసెంబర్ 23 : సీఎం సహాయనిధి పేదలకు కొండంత అండగా ఉంటుందని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని దామెరభీమనపల్లి, కమ్మగూడెం గ్రామాలకు చెందిన మిడిపల్లి మమతకు రూ.12 వేలు, బిక్కునాయక్కురూ.లక్ష, శ్రీనునాయక్కు రూ.లక్ష సీఎం సహాయనిధి నుంచి మంజూరయ్యాయి. లబ్ధ్దిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి హైదరాబాద్లోని ఆయన నివాసంలో శుక్రవారం చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పాక నగేశ్యాదవ్, బీఆర్ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు.
చండూరు: మండలంలోని తేరట్పల్లి గ్రామానికి చెందిన బరిగెల సతీశ్కు సీఎం సహాయ నిధి నుంచి రూ.54 వేలు మంజూరయ్యాయి. సంబంధిత చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మె ల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బరిగెల అశోక్, బీఆర్ఎస్ నాయకులు బొడ్డు సతీశ్ పాల్గొన్నారు.