నీలగిరి, ఏప్రిల్ 13 : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లోని ఉద్యోగులను నియమించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ 2025 ఫలితాలను ఎస్ఎస్సి ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా 28.15 లక్షల అభ్యర్థులు పోటీ పడగా కేవలం 15,118 మంది మాత్రమే తుది ఎంపిక జాబితాలో స్థానం పొందారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఘట్కేసర్కు చెందిన నూకల రామ్ చరణ్ ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంకు సాధించి జిఎస్టి ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. అదే విధంగా కోదాడకు చెందిన ఒట్టే సాయికుమార్ ఆల్ ఇండియా స్థాయిలో 24వ ర్యాంకు సాధించి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు.