నార్కట్పల్లి, డిసెంబర్ 11 : కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆలయాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు దీపాలు వెలిగించడంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
మేళ్లచెర్వు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు కల్యాణం జరిపించారు. చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వ స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది. ఈ సందర్భంగా ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో భక్తులు స్వామికి సామూహిక వ్రతాలు చేశారు. ఆలయాన్ని సంగారెడ్డి కలెక్టర్ శరత్ కుటుంబసభ్యులతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.