త్రిపురారం, మే 11 : మండల కేంద్రానికి చెందిన అనుముల సత్యనారాయణరెడ్డి, సరిత దంపతుల కుమారుడు సాయిభార్గవ్రెడ్డి బాక్సింగ్లో రాణిస్తున్నాడు. భార్గవ్రెడ్డి 4వ తరగతి నుంచి తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో శిక్షణ పొందుతూ ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో రెండు బంగారు పతకాలు, ఒక కాంస్య పతకం సాధించాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో రాష్ట్రం తరఫున జాతీయస్థాయిలో రాణించాడు.
ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో అంతర్జిల్లాల సబ్ జూనియర్స్ 48 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. హైదరాబాద్లోని మల్కాజ్గిరి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన జాతీయ సబ్ జూనియర్ 48 కేజీల బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి అంతర్జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. భార్గవ్ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని క్రీడల పాఠశాలలో పదో తరగతి విద్యనభ్యసిస్తున్నాడు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన భార్గవ్ను కోచ్ ఆనంద్, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. స్థానిక సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి ఫోన్ ద్వారా అభినందించారు.