అనుకున్న లక్ష్యం చేరే వరకూ యువత విశ్రమించొద్దని, ప్రయత్నం చేయకుండా ఏదీ సొంతం కాదని ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ను ఆయన సోమవారం సందర్శించారు. ఐటీ హబ్లో ఉద్యోగాల ఎంపిక కోసం శిక్షణ పొందుతున్న 500 మంది యువతీ యువకులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రాజీ లేకుండా చేసే కృషితో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సూచించారు. టాస్క్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులందరి ప్రయత్నం సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. అనంతరం టాస్క్లో శిక్షణ పొంది ఏడాదికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించిన యువతను అభినందించారు.
సూర్యాపేట టౌన్, డిసెంబర్ 18 : తాము అనుకున్న లక్ష్యం చేరే వరకు యువత విశ్రమించొద్దని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. ఐటీ హబ్లో ఉద్యోగాల ఎంపిక కోసం 500ల మంది యువతీ, యువకులకు టెక్ విజన్, షాప్డ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు శిక్షణ ఇస్తున్న తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ను జగదీశ్రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయత్నం చేయకుండా ఏది మన సొంతం కాదని తమ లక్ష్యం సాధించేంత వరకు రాజీలేకుండా చేసే కృషి చేయాలన్నారు.
యువత ఉన్నత శిఖరాలు అధిరోహిం చవచ్చని అన్నారు. భావి ఇంజినీర్లుగా తమను తాము తీర్చిదిద్దుకునేందుకు సూర్యాపేటలో టాస్క్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులందరి ప్రయత్నం సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టాస్క్లో శిక్షణ పొందిన కార్పొరేట్ కంపెనీల్లో సంవత్సరానికి రూ.20,15 లక్షల వేతనంతో ఉద్యోగాలు సాధించిన యువతులకు మంత్రి అభినందనలు తెలిపారు. విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవడంలో ప్రధాన భూమిక అయిన ల్యాప్టాప్లను ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ సీజీఐ స్పాన్సర్ చేయగా వాటిని టాస్క్ సంస్థకు జగదీశ్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో సాఫ్ట్ వేర్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు కొణతం సైదిరెడ్డి, యలక గోపిరెడ్డి, కొండపల్లి పవన్రెడ్డి పాల్గొన్నారు.
బొడ్రాయిబజార్: సూర్యాపేట ఎమ్మెల్యేగా గుంటకండ్ల జగదీశ్రెడ్డి మూడోసారి గెలుపొందిన సందర్భంగా తమిళనాడులోని వేలంగిని మేరీమాత ఆలయానికి మోకాళ్లపై నడిచి మొక్కు తీర్చుకున్నాడు బీఆర్ఎస్ క్రిస్టియన్ మైనార్టీ నాయకుడు పూర్ణశశికాంత్. సోమవారం ఉదయం ప్రధాన ఆలయంలో ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి కొరకు ఫాదర్ జోసఫ్చే కృతజ్ఞత ప్రార్థనలు చేయించారు.
నాగారం : సూర్యాపేట ఎమ్మెల్యేగా గుంటకండ్ల జగదీశ్రెడ్డి మూడోసారి గెలుపొందిన సందర్భంగా సోమవారం మండలంలోని పేరబోయినగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు క్యాంప్ కార్యాలయంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా, పూలమాలతో సన్మానించి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యారాల రాంరెడ్డి, ఉప సర్పంచ్ కడారి సత్తయ్య, తీగుళ్ల ప్రశాంత్, దొడ్డి ప్రేమయ్య, కంచికట్ల లింగయ్య, సుకుమార్, సంతోష్, మధు పాల్గొన్నారు.