రామగిరి, జూన్ 11 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో గల కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల- బొట్టుగూడను గురువారం కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల ఆవరణ తరగతి గదులు, లైబ్రరీ, కంప్యూటర్, క్రీడల గదులతో పాటు డిజిటల్ బోర్డులను, వంటగది, డైనింగ్ హాల్ పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంపైనే ఉపాధ్యాయులు దృష్టి సారించాలని ఆదేశించారు. పాఠశాల ద్వారా గుణాత్మక విద్యతో పాటు, పరిసరాలు కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడాలని, టాయిలెట్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, తరగతి గదులు, పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉంచాలని కోరారు.
ఈ నెల 15న పాఠశాల పునప్రామనాటికి చికెన్ చేయాలని కోరారు. అలాగే తరగతి గదిలో ఏసీలు వినియోగించేటప్పుడు తరగతి గదులు మూసి ఉంచాలని, పాఠశాలలోని లైబ్రరీ, గేమ్స్ ,ఇతర అన్ని పరికరాలు విద్యార్థులు వినియోగించుకునే విధంగా చూడడమే కాకుండా వాటిని జాగ్రత్తగా సంరక్షించాలన్నారు. పాఠశాలలో పచ్చదనం ఉండే విధంగా మొక్కలకు నిరంతరం నీరంందించాలని, మొక్కలు ఎండిపోకుండా చూడాలని, పాఠశాల ఆవరణలోకి వాహనాలు రాకుండా చూడాలన్నారు. ఆయన వెంట నల్లగొండ ఎంఈఓ అరుంధతి, పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయులు ఉన్నారు.

నాణ్యమైన విద్యపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలి : కలెక్టర్ బి.చంద్రశేఖర్