ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్ష (టెట్) ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సజావుగా సాగింది. శుక్రవారం ఉదయం నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 18,062 మంది హాజరు కాగా, 4,734మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్-2కు 2,029 మంది ర్హాజరవగా, 18,856 మంది పరీక్ష రాశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు, వారి సహాకులతో పరీక్ష కేంద్రాల వద్ద హడావిడి కనిపించింది. మిర్యాలగూడలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సెంటర్లో ఒక అభ్యర్థి మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతుండగా తనిఖీ అధికారులు గుర్తించి డిబార్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేశారు. పరీక్షా కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఈఓలు, ప్రత్యేక పర్యవేక్షకులు సందర్శించారు.
రామగిరి, సెప్టెంబర్ 15 : ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్ష (టెట్)-2023 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సజావుగా ముగిసింది. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు నిర్వహించిన పేపర్-1 పరీక్ష జరుగగా, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేపర్-1కు 18,062 మంది హాజరు కాగా 4,734 మంది గైర్హాజరయ్యారు. అలాగే పేపర్-2కు 18,856 మంది హాజరు కాగా 2,029 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ పరీక్షా కేంద్రంలో అభ్యర్థి మాల్ ప్రాక్టీస్కు పాల్పడగా అధికారులు డిబార్ చేశారు. అదే కేంద్రంలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేశారు. ఆయా పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్లు, డీఈఓలు, ప్రత్యేక పర్యవేక్షకులు పరిశీలించారు.
టెట్కు ఈ పర్యాయం నల్లగొండ జిల్లా కేంద్రంలో కాకుండా మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా మిర్యాలగూడలో 26, దేవరకొండలో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ తీరును అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఈఓ బి.భిక్షపతి, పరీక్షల పర్యవేక్షకులు కె.నర్సింహాలు పర్యవేక్షించారు.
నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఓ అభ్యర్థి మాల్ ప్రాక్టీస్కు పాల్పడగా అధికారులు గుర్తించి డిబార్ చేశారు. అలాగే విధుల్లో అలసత్వం వహించిన ఇన్విజిలేటర్ను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.