సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డలో శ్రీ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు.
బోనాల పండుగను పురస్కరించుకొని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ముందస్తుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గౌడ పెద్దలు, పూజారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించిన అనంతరం శాలువాతో సత్కరించారు.