సూర్యాపేట, జూన్ 15 : రుతుపవనాలతో వర్షాలు పడాల్సిన సమయంలో భానుడు భగభగ మండిపోతున్నాడు. మే నెలలో ఉండే ఉష్ణోగ్రతలు జూన్ 15 దాకా ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం అలింగాపురంలో 44.2 డి గ్రీల ఉష్ణోగ్రత నమోదైయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గరిష్ఠంగా 40 డిగ్రీలు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలకు పైగానే నమోదు అవుతున్నాయి. ప్రజలు మధ్యా హ్నం ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైన ఎండలకు భయపడి చాలా మంది చిన్నారులను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపించడం లేదు. కొన్ని పాఠశాలలు పూట మాత్రమే నడిపిస్తున్నారు.
మఠంపల్లి, మేళ్లచెర్వు మండలాల్లో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా కోదాడ 42.3, మునగాల, అన ంతగిరి , హుజూర్నగర్, మద్దిరాల 42.6, సూర్యాపేట, నడిగూడెం మండలాల్లో 42 డిగ్రీల కు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన మండలాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది.