సూర్యాపేట రూరల్, ఫిబ్రవరి 13 : గత ప్రభుత్వాల హయాంలో గ్రామాల్లో హత్యలు, గూండాయిజంతో ఎప్పుడూ ఘర్షణ, భయానక వాతావరణం ఉండేదని, సీఎం కేసీఆర్ పాలనలో ప్రశాంత వాతావరణంలో వర్థిల్లుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఎర్కారం గ్రామంలో గ్రామ సర్పంచ్ చింతలపాటి మౌనికామధు ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు దివంగత ఒంటెద్దు వెంకన్న విగ్రహాన్ని మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ గూండాల చేతిలో హత్య గావింపబడిన ఒంటెద్దు వెంకన్న మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. వెంకన్న క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షుడు నునావత్ మోతీలాల్, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, ఎంపీటీసీ లునావత్ శాంతాబాయి, ఒంటెద్దు నిర్మల, టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు ముదిరెడ్డి సంతోశ్రెడ్డి, విద్యార్థి విభాగం మండలాధ్యక్షుడు బొడ్డు కిరణ్యాదవ్, నాయకులు వెంకన్నయాదవ్, తిరుమల్, వెంకటేశ్వర్రావు, లింగయ్య, శ్రీనివాస్రెడ్డి, రమణారెడ్డి, యాదగిరి, అనంతరెడ్డి, వాసుదేవరెడ్డి, రాఘవరెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.