సూర్యాపేట రూరల్, జూలై 9 : గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుని పచ్చని వాతావరణం నెలకొల్పాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి యాదయ్య అన్నారు. మండలంలోని కేసారం, తాళ్లకాంపాడ్ గ్రామాల్లో ఆర్డీఓ రాజేంద్రకుమార్తో కలిసి శుక్రవారం పర్యటించారు. మురుగు కాల్వలు, శ్మశానవాటికలు, చెత్త, డంపింగ్యార్డులు, పల్లెప్రకృతి వనాలను పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు.
ప్రతిఒక్కరూ పది మొక్కలు నాటాలి : ఆర్డ్డీఓ
ప్రతిఒక్కరూ పది మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఆర్డీఓ రాజేంద్రకుమార్ అన్నారు. సూర్యాపేట మండలంలోని కేటీ అన్నారం, కాసరబాద గ్రామాల్లో పల్లె ప్రగతిలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కేటీ అన్నారంలో పల్లె ప్రకృతివనం, కాసరబాదలో ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, ఎంపీడీఓ శ్రీనివాస్రావు, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, ఎంపీఓ పరాంకుశరావు, సర్పంచులు, పంచాయతీ పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి
ఆత్మకూర్(ఎస్) : పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయని జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ అన్నారు. మండలంలోని కోటపహాడ్ గ్రామంలో శుక్రవారం వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం స్థలాలను పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. మండల ప్రత్యేకాధికారి దయానందరాణి, గ్రామ ప్రత్యేకాధికారి ధారాసింగ్, సర్పంచ్ శేఖర్రెడ్డి, ఎంపీటీసీ కందాళ వీరారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పచ్చదనం పెంచేందుకే.. : ఎంపీపీ
చివ్వెంల : పచ్చదనం పెంచడం కోసమే ప్రభుత్వం హరితహారం చేపట్టిందని, కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని ఎంపీపీ ధరావత్ కుమారీ బాబూనాయక్ అన్నారు. మండలంలోని తిమ్మాపురం గ్రామ శివారు నుంచి ఖాసీంపేట క్రాస్ రోడ్డు వరకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డు వెంట మొక్కలు నాటారు. మ్రండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు, పీఆర్ డీఈఈ మనోహర్, ఎంపీడీఓ కె.జమలారెడ్డి, ఏపీఓ నాగయ్య, సర్పంచ్ నంద్యాల జనార్దన్రెడ్డి, సూర్యాపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఊట్కూరి సైదులు
పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలి
బొడ్రాయిబజార్ పట్టణ ప్రగతిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కౌన్సిలర్లు కోరారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 15, 19, 44వ వార్డుల్లో కౌన్సిలర్లు పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మొక్కలు నాటారు. సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలన్నారు.ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కౌన్సిలర్లు ఎల్మినేటి అభినయ్, సుంకరి అరుణ, కెక్కిరేణి శ్రీనివాస్, మున్సిపల్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
తుంగతుర్తి
తిరుమలగిరి : మండలంలోని తాటిపాముల గ్రామంలో శుక్రవారం శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేశారు. తొండ గ్రామంలో ఇంటింటికీ పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. కన్నారెడ్డికుంటతండాలో సెగ్రిగేషన్ షెడ్డులో వర్మీకంపోస్ట్ తయారీని అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఎంపీపీ స్నేహలత, ఎంపీడీఓ ఉమేశ్చారి, ఎంపీఓ మారయ్య, సర్పంచులు పాల్గొన్నారు.
నాగారం : మండలంలో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాలను ప్రత్యేకాధికారి లక్ష్మీనారాయణ పరిశీలించి పూర్తి చేయాలని సూచించారు. ఎంపీపీ కూరం మణి, వైస్ ఎంపీపీ మణిమాల, ఎంపీడీఓ శోభారాణి, ఏపీఓ శేఖర్రావు, సర్పంచులు పాల్గొన్నారు.
తుంగతుర్తి : తూర్పుగూడం, సంగెం, గుడితండా గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టి మొక్కలు నాటారు. వైకుంఠధామాలను అధికారులు పరిశీలించారు. ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్, మండల ప్రత్యేకాధికారి రామారావు, ఎంపీడీఓ లక్ష్మి, సర్పంచులు పాల్గొన్నారు.
నూతనకల్ : గ్రామాల్లో పారిశుధ్య పనులు నిర్వహించి మొక్కలు నాటారు. ఎంపీపీ భూరెడ్డి కళావతి, జడ్పీటీసీ దామోదర్రెడ్డి, తాసీల్దార్ జమీరొద్దీన్, ఎంపీడీఓ ఇందిర, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
అర్వపల్లి : గ్రామాల్లో మొక్కలు పంపిణీ చేశారు. ఎంపీపీ మన్నె రేణుక, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్, సర్పంచులు బి.సునీతారామలింగయ్య, శేఖర్, సుజాత, పీరమ్మ, పద్మ, ఉషారాణి
మద్దిరాల : మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంలో, చందుపట్లలో పిచ్చిమొక్కలు తొలగించారు. కుంటపల్లిలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ముకుందాపురంలో రోడ్లను శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను తొలగించారు. జి.కొత్తపల్లిలో మురుగు కాల్వలు, రోడ్ల వెంట శుభ్రం చేశారు. మండల ప్రత్యేకాధికారి శ్రీధర్ వైకుంఠధామం, పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. జడ్పీటీసీ కన్న సురాంబ పాల్గొన్నారు.