మునుగోడు: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు బాగా చదివి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా సాంఘిక సంక్షేమ సంఘం చైర్పర్సన్ నారబోయిన స్వరూపారాణి ఆకాంక్షించారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను పంపిణీ చేసి మాట్లాడు తూ విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు.
తల్లిదండ్రులు కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ఆమె వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, ఇన్చార్జి హెచ్ఎం యాదయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.