సూర్యాపేట, నవంబర్ 8: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెం టనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాలల విద్యార్థులతో కలిసి శనివారం సూర్యాపేటలోని ప్రధాన వీధుల గుండా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయన్నారు.
విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని పక్షంలో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పోనుగంటి రంగ, తెలంగాణ స్టూడెంట్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్, బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు పోలోజు మహేష్చారి, బీసీ యువజన సంఘం నాయకులు పరల సాయి, రాజబోయిన సుమన శివ, సాయికుమార్, విద్యార్థులు విజయకుమారి, లక్ష్మి, అనూష, సంగీత, భవాని తదితరులు పాల్గొన్నారు.