రామగిరి, డిసెంబర్ 6 : నెహ్రూయువ కేంద్రం, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నల్లగొండలో మంగళవారం ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఏ సీహెచ్.పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం హెచ్ఐవీ- ఎయిడ్స్ అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వృక్తత్వ పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో ప్రవీణ్, శ్రీనివాస్, జానయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.