నల్లగొండ : జిల్లాలో ఎవరైనా శిశువులను విక్రయించేందుకు ప్రయతించినా విక్రయించినట్లు తెలిసినా చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.
దేవరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్ర బిక్షా తండాకు చెందిన రుడావత్ గోపి, కవిత దంపతులకు రెండో కాన్పులో ఆడ కవల పిల్లలు జన్మించగా.. వీరిలో ఒకరిని విక్రయించినట్లు అంగవాడి వర్కర్ల సమాచారంతో వీరి పైన కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..శిశు విక్రయాలు,శిశు హత్యలు, కుటుంబానికి వారసుడు కావాలనే అసాంఘిక దురాచారాలు, ప్రజల్లో మూఢ నమ్మకాలపైన పోలీస్ కళా బృందం వారు ఎల్లప్పుడూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ఎవరైనా శిశువులను విక్రయించినట్లు సమాచారం తెలిస్తే డయల్ 100 కు గానీ సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఎస్పీ తెలిపారు.