చందంపేట, ఆగస్టు 23 : నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (ఎన్ఎఫ్బీఎస్) కింద అర్హులైన అబ్దిదారులకు త్వరితగతిన సహాయం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శనివారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో ఎన్ఎఫ్బీఎస్ అమలుపై అధికారులతో సమీక్షించారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒంటరి మహిళల వివరాలు వారం రోజుల్లో అందించాలన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఏపీఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.