శ్రీరామ నవమి వేడుకలు బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆలయాలతోపాటు పలుచోట్ల సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తరించారు.
వేద మంత్రాలు, భక్తిపాటలతో ఆధ్యాత్మిక సందడి కనిపించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు పలుచోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు.