నల్లగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నల్లగొండ పట్టబంలోని ఎన్.జి. కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను ఆమె పరిశీలించారు.
అనంతరం పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, సీఐలు చంద్రశేఖర్ రెడ్డి, చీర్ల శ్రీనివాస్, ఇతర పోలీస్ అధికారులున్నారు.