కోదాడ రూరల్, మార్చి 22 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణంగా పరిశీలించాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. శుక్రవారం ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధి నల్లబండగూడెం శివారులోని రామాపురం క్రాస్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు.
రెండు వైపులా తనిఖీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, అనుమానాస్పద వ్యక్తుల సంచారాన్ని ప్రజలు అధికారులు అందించాలని కోరారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాల్లో రూ.84 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో విజయవాడ రూరల్ డీసీపీ శ్రీనివాస్రావు, నందిగామ ఏసీపీ రవికిరణ్, కోదాడ డివిజన్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.