రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్
నల్లగొండ రూరల్, జూన్ 26 : గొల్లకురుమల ఆర్థిక పురోభివృద్ధికే సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకం అమలు చేస్తున్నారని రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. గొర్రెల లబ్ధిదారుల ఆత్మీయ కలయికలో భాగంగా ఆదివారం నల్లగొండ మండలం అనంతారంలో లబ్ధిదారుడు సుంకరబోయిన వెంకన్నయాదవ్ కటుంబాన్ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల లబ్ధిదారుల ఆత్మీయ కలయికలో భాగంగా ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారుడు వెంకన్న పొందిన లబ్ధి, ఆర్థిక స్థితిగతిని తెలుసుకొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా గొల్లకురుమల ఆర్థిక పురోభివృద్ధి చెందాలన్న ఆశయం వాళ్లతో మాట్లాడడంతో నెరవేరిందని, పది కాలాలపాటు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిసిందని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న సీఎం కేసీఆర్పై ప్రజలకు ఉన్న ప్రేమ ఏమిటో అర్థమైందని దూదిమెట్ల పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడి వీరమణెమ్మ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పంకజ్యాదవ్, రాష్ట్ర యాదవ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొబ్బిల గోపాలకృష్ణయాదవ్, జిల్లా యాదవ సంఘం మాజీ అధ్యక్షుడు అల్లి వేణుయాదవ్, సహకార బ్యాంక్ డైరెక్టర్ ఎల్వీ యాదవ్, యాదవ సంఘం డివిజన్ అధ్యక్షుడు మల్లేశ్యాదవ్, కడారి వెంకన్న యాదవ్ పాల్గొన్నారు.