చౌటుప్పల్ రూరల్, మార్చి 10 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని మందోళ్లగూడెం గ్రామంలో శుక్రవారం వారు యాదవులకు రెండో విడుత గొర్రెలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో ఒక్కో లబ్ధిదారుడి అకౌంట్లో రూ.1.58లక్షల చొప్పున మొత్తం రూ.93కోట్లు జమ చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
గొల్ల కురుమల కుటుంబాలు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు. గొర్రెలను ఏ రాష్ట్రం నుంచైనా కొనుగోలు చేసే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. కార్యక్రమంలో చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కంటి నిరంజన్గౌడ్, బొడ్డు శ్రీనివాస్రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి కృష్ణారెడ్డి, బండారు నర్సింహ పాల్గొన్నారు.