రామగిరి, మార్చి 10 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని తులసీనగర్ దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న శేఖర్ మంగళవారం కార్యనిర్వాహణ అధికారిగా పదోన్నతి పొందాడు. హైదరాబాద్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ చేతుల మీదుగా ఆయన పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నాడు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏసీ భాస్కర్, అర్చకులు, తులసీనగర్ దేవాలయ అర్చకులు శివప్రసాద్ శర్మ, హరీష్ శర్మ, హనుమంతాచార్యులు, పలువురు బ్రాహ్మణులు శేఖర్కు అభినందనలు తెలిపారు.