హాలియా, జనవరి 19 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు కేంద్రాలను ప్రారంభించారు. వైద్య సిబ్బంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు, మందులు అందించారు. అనుముల మండలంలోని మారేపల్లిలో జడ్పీ వైస్చైర్మన్ ఇరిగి పెద్దులు, పులిమామిడిలో ఎంపీపీ సుమతీపురుసోత్తం, అన్నారంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి రాజ్కుమార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మాలే అరుణాసత్యనారాయణరెడ్డి, తాసీల్దార్ మంగ, ఎంపీడీఓ గోళ్ల లక్ష్మి, మండల వైద్యాధికారి డాక్టర్ రామకృష్ణ, క్యాంప్ ఇన్చార్జి నితిన్, శ్రీనివాస్, రుబీనా, హెల్త్ అసిస్టెంట్ సైదులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.