సంస్థాన్ నారాయణపురం: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి జినుకల జనార్ధ న్యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచిం చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జినుకల కిరణ్యాదవ్, వార్డు సభ్యులు కడ్తల చంద్రశేఖర్, నర్రి సువర్ణ, కొంపల్లి సుగుణ నర్సింహా, సిరిపంగి గాలయ్య, నాయకులు పరుశురాం యాదవ్, సాయిలు, శ్రీనివాస్ పాల్గొన్నారు.