హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో సనాతన ధర్మ పరిరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట శివాలయాలు, ధార్మిక ఆధ్యాత్మిక సంఘాల ఐక్యవేదిక, స్వామీజీలు, పీఠాధిపతులు, గురూజీల సహకారంతో నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సనాతన ధర్మం, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను కొనియాడారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున స్వామీజీలు, పీఠాధిపతులు, గురూజీలు, భక్త బృందాలు పాల్గొన్నారు.