గతేడాది నీటితో కళకళలాడిన శాలిగౌరారం ప్రాజెక్టు నేడు నీళ్లు లేక వెలవెలబోతున్నది. గడిచిన పదేండ్లలో ఇంత గణనీయంగా నీటిమట్టం తగ్గిన దాఖలాలు లేవు. ప్రతియేటా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి వానకాలం, యాసంగి పంటలకు సరిపడా నీళ్లందించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఆయకట్టు కింద యాసంగి సాగు గట్టేక్కేనా అనే మీమాంసలో రైతులు ఉన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీట్టిమట్టం 21 అడుగులకు ప్రస్తుతం 3.6 నుంచి 6 అడుగులు మాత్రమే ఉన్నది.
– శాలిగౌరారం, మార్చి 21