ప్రజలు భాగస్వామ్యం కావాలి
పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్రావు
యాదగిరిగుట్ట రూరల్, జూన్ 15 : పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్రావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని వంగపల్లి గ్రామంలో పల్లెప్రగతి పనులను తనిఖీ చేశారు. గ్రామంలోని వైకుంఠధామం, డంపింగ్యార్డు, నర్సరీ, పల్లెప్రకతి వనం, హరితహారం మొక్కలను పరిశీలించారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఆయన వెంట డీపీఓ సునంద, ఎంపీడీఓ కారం ప్రభాకర్రెడ్డి, ఎంపీఓ చంద్రశేఖర్, సర్పంచ్ కానుగు కవిత, ఉప సర్పంచ్ రేపాక స్వామి పాల్గొన్నారు.
ఆలేరు మండలంలో..
ఆలేరురూరల్ : మండలంలోని టంగుటూరు, మందనపల్లి గ్రామాల్లో జరుగుతున్న పల్లెప్రగతి పనులను పంచాయతీరాజ్శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్రావు తనిఖీ చేశారు. కార్యక్రమంలో జడ్పీసీఈఓ కృష్ణారెడ్డి, డీఎల్పీఓ యాదగిరి, ఏంపీడీఓ జ్ఞానప్రకాశ్రావు, ఎంపీఓ సలీమ్, సర్పంచులు కోటగిరి పాండరి, కట్ట సమరసింహారెడ్డి, ఎంపీటీసీ జూకంటి అనూరాధ పాల్గొన్నారు.