యాదగిరిగుట్ట, మార్చి 3 : దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిషరించాలని ఆర్టీసీ యాదగిరిగుట్ట డిపో కార్మికులు డిమాండ్ చేశారు. ఆదివారం యాదగిరిగుట్ట డిపో దగ్గర కార్మికులు యూనియన్లకు అతీతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.
పెండింగ్లో ఉన్న రెండు పీఆర్సీలను వెంటనే చెల్లించాలని, ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన బంద్ కాలం నాటి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆర్టీసీ కార్మికుల సమస్యలను తెలియజేసేందుకే ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. సీఎం రేవంత్రెడ్డి కార్మికుల పక్షపాతిగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిషారానికి చొరవ చూపుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు మురళి, కృష్ణయ్య, కుమార్, రమేశ్, యాదగిరి, నగేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.