సూర్యాపేట అర్బన్ : ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసిన సందర్భంగా పలువురు ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని సూర్యాపేటలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ హైదరాబాద్ జోన్ జాయింట్ సెక్రటరీ సుంకరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి పక్షాలు సమస్యలు సృష్టించినా అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లును ఆమోదింప చేసిన సీఎం కేసీఆర్కు సంస్థ ఉద్యోగులు రుణపడి ఉంటారన్నారు.
సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కృషి చేసిన మంత్రులు కేటీఆర్, గుంటకండ్ల జగదీశ్రెడ్డికి ఉద్యోగులు వెన్నంటే ఉంటారని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. మంత్రిని కలిసిన వారిలో టీఎంయూ నాయకులు బి.సీతారాములు, బెల్లి నర్సయ్య, డిపో కార్యదర్శి ఎన్పీ సైదులు, చెరుకు వెంకటయ్య, యూసుఫ్ జాని, వీరయ్య, శ్రీధర్, టీబీ రావు, రేణుక, సైదులు, జానయ్య, శ్రీనివాస్రెడ్డి, అంజి, నాగరాజు, ఉపేందర్, ప్రవీణ్ ఉన్నారు.