నార్కట్పల్లి : నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో బిటి రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. సోమవారం నార్కట్ పల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా రూ.5.73 కోట్లతో రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.
నార్కట్ పల్లి మండలంలో నార్కట్ పల్లి నుంచి మాండ్ర వయా చౌటబాయి రోడ్డు మరమతులకు రూ.82.50 లక్షలు, చిట్యాల మండలంలో గుండ్రాoపల్లి నుంచి పేరేపల్లి వయా ఏపూరు రోడ్డు మరమతులకు రూ.119.00 లక్షలు, గుండ్రాoపల్లి నుంచి వెల్లంకి వయా సుంకెనపల్లి రోడ్డు మరమతులకు రూ.143.00 లక్షలు, కేతేపల్లి మండలంలో చెరుకుపల్లి నుంచి భీమారం వయా తుంగతుర్తి రోడ్డు మరమతులకు రూ.68.50 లక్షలు, NH 65 (NH 9) నుంచి కాసనగోడు రోడ్డు మరమతులకు రూ.117.00 లక్షలు, నకిరేకల్ మండలంలో నోముల నుంచి గుడివాడ రోడ్డు మరమతులకు రూ.32.00 లక్షలు, సుంకెనపల్లి నుంచి జైకేసారం రోడ్డు మరమతులకు (Flood Damage) రూ.11.00 లక్షలు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు.
త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్,సహకరించిన మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.