చిట్యాల, ఏప్రిల్ 09 : ఎర్రజెండా పోరాట యోధుడు కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డి 11వ వర్థంతి సందర్భంగా నేడు చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని ఆయన నిలువెత్తు విగ్రహం వద్ద సిపిఐ(ఎం) నాయకులు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ, కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ జూలకంటి రంగారెడ్డి, కామ్రేడ్ మల్లు లక్ష్మీ పాల్గొని పోరుబిడ్డకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఆరుసార్లు చట్టసభల మెట్లెక్కి అనుక్షణం సామాన్య జనం కోసం జీవించిన ప్రజా నాయకుడు నర్రా. ‘నర్రా’ అంటే కేవలం ఒక పేరు కాదు.. నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎదిరించి నిలబడిన విప్లవ శక్తి ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.
బీడు భూములకు జీవం పోసే లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్.ఎల్.బి.సి (SLBC) ప్రాజెక్టుల సాధనకై ఉద్యమించిన పాద యాత్రికుడు. అసెంబ్లీలో ఆయన గళమెత్తితే అధికార పక్షం సైతం ఉలిక్కిపడేది. బడుగు జీవుల కోసం ఆయన చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి ఎప్పటికీ సజీవం. ఆ మహా యోధుడికి ఇవే ఎర్రెర్రని జోహార్లు అని నినాదాలను మిన్నంటించారు.