సూర్యాపేటటౌన్, డిసెంబర్ 10 : రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సూర్యాపేట అభివృద్ధిని కొనసాగించాలని, అలాగే పెన్షనర్ల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని రిటైర్డ్ ఉద్యోగులు కోరారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించడంపై రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో జగదీశ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.సుదర్శన్రెడ్డి, ఉపాధ్యక్షులు కృపాకర్రెడ్డి, లక్ష్మీకాంత్రెడ్డి, మండల కార్యదర్శి నాగేశ్వర్రావు, బి.వీరయ్య, డి.వెంకన్న, వి.సత్యనారాయణరావు, భిక్షారెడ్డి, వి.రాంరెడ్డి, కె.రాంరెడ్డి, మోహన్రావు పాల్గొన్నారు.