కనగల్ మండలం దర్వేశిపురంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షిక బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం జమదగ్ని మహర్షి, రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి ఒడి బియ్యం, పట్టు వస్ర్తాలను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకలను వీక్షించారు.
కనగల్, మే 30 : మండలంలోని ధర్వేశిపురంలో కొలువైన జమదగ్ని మహర్షి ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం మంగళవారం కనులపండువగా జరిగింది. డేరం భాస్కర శర్మ, మల్లాచారి, శ్రవన్కుమారాచార్యులు, ఉమామహేశ్వరావు, దామోదర్రావుల వేద మంత్రోశ్చరణ, డుప్పు చప్పుళ్ల నడుమ కల్యాణం నిర్వహించారు. అంతకు ముందు సుప్రభాత సేవ, లలితా సహస్రనామార్చన, బాలబోగ నివేదన చేశారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కల్యాణానికి వడి బియ్యం, పట్టు వస్ర్తాలు సమర్పించారు. అంతకుముందు ధర్వేశిపురం ఆలయ సమీపంలో మిషన్ భగీరథ నిధులు రూ.50 లక్షల వ్యయంతో మంచినీటి (ఓవర్హెడ్ ట్యాంక్) పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
రెండు మూడు నెలల్లోనే పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గుత్తా అమిత్రెడ్డి, నల్లగొండ 8వ వార్డు కౌన్సిలర్ పిల్లి రామరాజుయాదవ్ కల్యాణ వేడుకకు హాజరై పూజలు చేశారు. భక్తులు కల్యాణ వేడుకకు అధిక సంఖ్యలో హాజరై వీక్షించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఈఓ జల్లెపల్లి జయరామయ్య, సర్పంచులు పూలమ్మ, అంజమ్మ, ఎంపీపీ కరీంపాషా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని యాదయ్యగౌడ్, వైస్ చైర్మన్ రామగిరి శ్రీధర్రావు, పాక్స్ చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, మాజీ చైర్మన్లు నల్లబోతు యాదగిరి, కంచరకుంట్ల గోపాల్రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, సిబ్బంది చంద్రయ్య, లింగయ్య, ఉపేందర్రెడ్డి, నాగరాజు, లింగస్వామి పాల్గొన్నారు.