వేములపల్లి, ఫిబ్రవరి 8 : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్డీఓ చెన్నయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో పలు వీధులను పరిశీలించి మాట్లాడారు. మురుగు కాల్వలు, వీధులు శుభ్రంగా ఉండేలా చూ తడాలని అధికారులను ఆదేశించారు. రానున్న వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట తాసీల్దార్ శ్రీనివాస్శర్మ, ఎంపీడీఓ జానయ్య, ఆర్ఐ మహేందర్రెడ్డి, బిల్ కలెక్టర్ నరేందర్, సిబ్బంది ఉన్నారు.
త్రిపురార : పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా గురువారం త్రిపురారం గ్రామపంచాయతీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అలివేలు మంగమ్మ మురుగు కాల్వలను, పూడికతీత పనులను పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కోడిరెక్క రాజేంద్రకుమార్, బొలిశెట్టి ఆదినారాయణ, నగిరి వెంకన్న పాల్గొన్నారు.
మాడ్గులపల్లి : మండలంలోని పాములపహాడ్లో పీఆర్ఏఈ నరేశ్ పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్తులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సైదులు, పాల్గొన్నారు. ప్రతి వీధి పారిశుధ్యంతో మెరవాలి
మిర్యాలగూడ రూరల్ : గ్రామం ప్రతి వీధి పారిశుధ్యంతో మెరిసేలా పని చేయాలని ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి అన్నారు. యాద్గార్పల్లి, కాల్వపల్లి గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించి పారిశుధ్యాన్ని పరిశీలించారు. కాల్వల్లో మురుగు నీరు నిల్వ లేకుండా, చెత్త పేరుకు పోకుండా చూడాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు గాయత్రి రెడ్డి, విజయ్, పాల్గొన్నారు.