గట్టుప్పల్, అక్టోబర్ 20: ఈ ఎన్నికతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మునుగోడు ఓటర్లు ఇదే తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. ప్రజల ఆత్మగౌరవాన్ని రూ.18 వేల కోట్లకు బీజేపీకి తాకట్టు పెట్టిన ఘనుడు అని విమర్శించారు. తనను గెలిపించాలని కోరుతూ గట్టుప్పల్ మండల కేంద్రంతోపాటు అంతంపేట, కమ్మగూడెం, శేరిగూడెం, చండూరు మండలంలోని ఇడికుడ, బంగారుగడ్డ ఠూగామాల్లో గురువారం ఆయన పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూసుకుంట్లకు బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ ప్రజలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఏమాత్రమూ నమ్మడం లేదన్నారు. రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయిన దొంగగా గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. అనేక హామీలిచ్చిన గెలిచాక అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనూ పనులు చేపట్టలేదన్నారు. వెనక్కి పంపిన అసమర్థ ను పిలుపునిచ్చారు.
కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి
సంక్షేమ, అభివృద్ధి పథకాలను విరివిగా చేపడుతున్న టీఆర్ఎస్కు ప్రజలు తెలుపుతున్నారని కూసుకుంట్ల అన్నారు. మునుగోడులో హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ మూడున్నరేండ్లలో రాజగోపాల్రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. అందుకే కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. మునుగోడులో గులాబీ జెండా ఎగురడం ద్వారా దేశవ్యాప్తంగా బీజేపీ నేతల గుండెలు అదరబోతున్నాయని అన్నారు. ప్రచార కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, టి.ప్రకాశ్గౌడ్, పట్నం నరేందర్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, కోరుకంటి చందర్, రసమయి బాలకిషన్, టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రకాశ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, సీపీఐ, కార్యదర్శులు నెల్లికంటి సత్యం, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కర్నాటి వెంకటేశం, ఇడెం రోజా, శ్రీశైలం, పద్మ, సత్తయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మునుగోడును నట్టేట ముంచేందుకే రాజగోపాల్రెడ్డి ప్రయత్నం
కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు తీసుకొని పనులు చేయకుండా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి కోట్లు గడించిన ఘనుడు రాజగోపాల్రెడ్డి అని ప్రభాక్రెడ్డి ఇప్పుడు రూ.18వేల కోట్ల కాంట్రాక్టు కోసం బీజేపీలో చేరి మునుగోడు ప్రజలను నట్టేటముంచేందుకు వస్తున్నాడని ధ్వజమెత్తారు. ఏ పార్టీలో కాంట్రాక్టులు దొరికితే ఆ పార్టీలోకి వెళ్లడం ఆయన నైజమన్నారు. వచ్చిన వేల కోట్లతో రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలు శాశ్వత సంతోషాన్నిచ్చే సీఎం కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు తప్ప.. రాజగోపాల్రెడ్డి ఇచ్చే డబ్బుకు కక్కుర్తి పడట్లేదని అన్నారు.