అత్యధికంగా పోచంపల్లిలో 49.2 మిల్లి మీటర్లు
భువనగిరి కలెక్టరేట్, జూన్ 19 : జిల్లాలోని పలు మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా భూదాన్పోచంపల్లి మండలంలో 49.2మిల్లీ మీటర్ల వర్షం కురువగా జిల్లా వ్యాప్తంగా 11.1మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
రాజాపేటలో 5.4 మి.మీ, యాదగిరిగుట్టలో 21.4మి.మీ, భువనగిరిలో 45.2మి.మీ, బీబీనగర్లో 4.6మి.మీ, భూదాన్పోచంపల్లిలో 49.2మి.మీ, రామన్నపేటలో 18.6మి.మీ, గుండాలలో 22.8మి.మీ చొప్పున వర్షం కురిసింది.
చౌటుప్పల్లో..
చౌటుప్పల్లో ఆదివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు వర్షం పడడంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.