మిర్యాలగూడ: బడుగు బలహీనవర్గాల అభివృద్ది కోసం మాజీ ఎమ్మెల్యే ధీరావత్ రాగ్యానాయక్ చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. బుధవారం రాగ్యానాయక్ వర్థంతి సందర్బంగా పట్టణంలోని సాగర్రోడ్డులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం రాగ్యానాయక్ సతీమణి మాజీ ఎమ్మెల్సీ భారతిరాగ్యానాయక్తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
వెనుకబడిన ప్రాంతంగా పేరుగాంచిన దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశారని, అనేక మారుమూల ప్రాంతాల్లో మౌలికవసతుల కల్పనకు కృషి చేశారని కొనియాడారు. దేవరకొండ నియోజకవర్గ సమస్యలను పలు మార్లు అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ధనావత్ చిట్టిబాబునాయక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మోషీన్అలీ, ధీరావత్ స్కైలాబ్నాయక్ మట్టపల్లి సైదులు, ఎండీ.షోయబ్, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.