– సర్పంచ్ పాలకూరి రమాదేవి
మునుగోడు, ఫిబ్రవరి 02 : మునుగోడు మండల కేంద్రంలోని కమ్మగూడెంలో గల మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలను సోమవారం ఉదయం సర్పంచ్ పాలకూరి రమాదేవి వార్డు సభ్యులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వంటగది, స్టోర్ రూమ్ లోని సరుకులు బియ్యం, నూనె, పప్పు దినుసులు, వంట సరుకులను, మెనూ రిజిస్టర్ ను పరిశీలించారు. విద్యార్థినులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. కచ్చితంగా మెనూ పాటించాలన్నారు. పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. ఆమె వెంట పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, వార్డు సభ్యుడు పందుల గంగాధర్ ఉన్నారు.

Munugode : ‘విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి’