నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ధాన్యం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 7న జిల్లా కేంద్రంలో తలపెట్టిన నిరసన దీక్షలను విజయవంతం చేయాలి అని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం చింతపల్లి మండలంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..8న జిల్లాలోని అని గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు, ప్రతి రైతు ఇంటిపై నల్లజండాలు ఎగరవేయడం, మున్సిపాలిటీల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాల ఎగురవేయాలి అని ఆయన పిలుపునిచ్చారు.
ఈనెల11న హస్తిన లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్ష చేపడతారని చెప్పారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోగా అవమానకర, అహంకారపూరిత ధోరణిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి అవమానించిన గోయల్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు దేన్నయినా సహిస్తారు.
కానీ,ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోరని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతులను, ప్రజలను అవమానించిందని, బీజేపీ సర్కారు వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గున్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.