మాడ్గులపల్లి, జూన్ 24 : మాడ్గులపల్లి మండలంలోని ఇందుగుల, పాములపాడు, చర్లగూడెం ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం ప్రీ ప్రైమరీ తరగతులను ఎంఈఓ సీహెచ్ వెంకటమ్మ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ (నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ) తరగతులను విజయవంతంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ ప్రీ-ప్రైమరీ తరగతులు అందుబాటులో ఉంటాయి. ఆయా కార్యక్రమాల్లో హెచ్ఎం భిక్షం, జీహెచ్ఎం పద్మావతి, ఆగా మోత్కూర్ కాంప్లెక్స్ హెచ్ఎం వై.వినోద్ కుమార్, చర్లగూడెం హెచ్ఎం నిరంజన్ రెడ్డి, పాములపాడు హెచ్ఎం వెంకన్న, ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు, ఏఏపీసీ చైర్మన్ నాగలింగమ్మ, చర్లగూడెం ఉప సర్పంచ్ జ్యోతి, కార్యదర్శి అశోక్, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.

మాడ్గులపల్లిలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం