నీలగిరి, నవంబర్ 30 : నల్లగొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కనగల్ మండలం పొనుగోడు గ్రామ సర్పంచ్ మెరుగు శివయ్య తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో బుధవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. అన్ని వర్గాల ప్రజలు వారి పాలనలో చల్లగా ఉన్నారని, ఆయన నాయకత్వమే తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.
కేంద్రం సహకరించకపోయినా రాష్ర్టాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీంపాషా, సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవ్రెడ్డి, ఎంపీటీసీ పులకరం వెంక న్న, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కడారి కృష్ణయ్య, జంగమయ్యగూడెం సర్పంచ్ కన్నెబోయిన సతీశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని యాదయ్య, నాయకులు దోటి శ్రీనివాస్, ఎర్రమాద వెంకట్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.