భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 19 : ఒకప్పుడు అరబ్ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన హస్త కళా గ్రామం పోచంపల్లి. అదే ఇప్పుడు చేనేతలో కాటన్, పట్టు, సీకో వస్త్రాలకు పేరుగాంచింది. పోచంపల్లిని ప్రేమగా సిల్ సిటీ అని పిలుచుకుంటారు. నిజాం కాలంలోనే చెట్లు, పూల నుంచి తీసిన సహజమైన రంగులతో ఇకడి చేనేత కార్మికులు రుమాళ్లు తయారు చేసేవారు. వాటిని అరబ్ దేశాలకు ఎగుమతి చేసేవారు. అరవై ఏండ్ల కిందటే టై అండ్ డై పద్ధతిలో మగ్గాల మీద నైపుణ్యంగా నేసేవారు. 1970 నుంచి పట్టు చీరెల నేతపై పట్టు సాధించారు. దేశంలో ప్రసిద్ధిచెందిన పదకొండు రకాల చేనేతల్లో పోచంపల్లి ఒకటిగా నిలిచింది. ఇదో ప్రత్యేక శైలి. రెండు దశాబ్దాల కిందటే టై అండ్ డైలో జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపును సాధించింది. మొదటి పేటెంట్ను పొందింది. ఫలితంగా చేనేత ఉత్పత్తుల ఎగుమతి పెరిగింది. పోచంపల్లి కార్మికుల ప్రతిభ విశ్వవ్యాప్తం అయ్యింది. ఇకడి నేతన్నలు తమ నైపుణ్యంతో పద్మశ్రీ వంటి పురసారాలనూ అందుకున్నారు. పోచంపల్లి చేనేతది వందేండ్ల చరిత్ర.
అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన పోచంపల్లి వస్త్రాలు, డిజైన్ల పట్ల విదేశీ మగువలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లోనే పోచంపల్లి వస్త్రాలు తయారయ్యేవి. ఇప్పుడు ఇంద్ర ధనుస్సులోని అన్ని రంగుల్లోనూ నేస్తున్నారు. వీటిలో ఇకత్ పట్టు చీరెలకు మహా గిరాకీ. సంప్రదాయానికి కట్టుబడుతూనే, మారుతున్న అభిరుచులకు.. జాతీయ, అంతర్జాతీయ మారెట్ అవసరాలకు అనుగుణంగా నేతన్నలు తమ కళకు సమకాలీన నైపుణ్యాన్ని జోడిస్తున్నారు. సుప్రసిద్ధమైన పోచంపల్లి కళాప్రతిభ పోచంపల్లి పొలిమేరలకే పరిమితం కాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. చుట్టూ దాదాపు రెండొందల గ్రామాల్లో అయిదు లక్షల మంది ఈ కళనే ఉపాధిగా ఎంచుకొన్నారు. ఇకడ తయారైన వస్త్రాలు అమెరికా, స్విట్జర్లాండ్, సింగపూర్, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఒకో చీరె ధర గరిష్ఠంగా యాభై వేల రూపాయల వరకూ ఉంటుంది.
1910 నుంచి చిటికీ పరిశ్రమ
1910లో ఇకడ చిటికీ పరిశ్రమ ఏర్పడింది. 20వ నంబర్ నూలుపై తేలియా రుమాలు మొదట తయారు చేశారు. వ్యాపార నిమిత్తం హైదరాబాద్కు వచ్చే అరబ్బులు వీటిని ఇష్టపడడంతో తర్వాత అరబ్ దేశాలకు ఎగుమతి అయ్యాయి. రానురాను కాటన్ వస్త్రాలు తయారు చేయడం ప్రారంభించారు.
టూరిజం సెంటర్ను పట్టించుకోని పర్యాటక శాఖ
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రెండు ఎకరాల స్థలంలో రూరల్ టూరిజం సెంటర్ను నిర్మించారు. అందులో చేనేత వస్త్రాల తయారీని తెలిపే మగ్గాలు, వస్త్రాలను, గ్రామీణ కళాకారుల తమ ప్రతిభ ప్రదర్శించేలా హంపి థియేటర్ను ఏర్పాటు చేశారు. చేనేత వస్ర్తాలను విక్రయించేకునే అవకాశం కల్పించారు. కానీ అవి ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. పర్యాటకులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడమే ప్రధాన కారణం. రామోజీ ఫిలిం సిటీకి వచ్చే టూరిజం బస్సులను భూదాన్ పోచంపల్లి మీదుగా యాదగిరిగుట్ట వరకు నడిపించాలని స్థానికులు కోరుతున్నారు.