చివ్వెంల: రాష్ట్ర వ్వాప్తంగా అన్ని పాఠశాలలు,కళాశాలలు పున ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని గురుకు లాల్లో పారిశుధ్య పనులు చేపట్టి ముందస్తుగా అందుబాటులో ఉంచాలని రాష్ట్ర గురుకులాల సెక్రటరీ రోనాల్డ్ రోస్ సంబంధి త అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ హేమంత పాటిల్తో కలిసి స్థానిక గురుకుల పాఠశాలను సందర్శించి మాట్లాడారు.
కరోనా నేపథ్యంలో పిల్ల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈనెల 30 లోపు అన్ని పాఠ శాలలు, కళాశాలల్లో పారిశుధ్య పనులు చేట్టి అందుబాటులో ఉంచాలని అన్నారు. పిల్లల్లో లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందించాలని ఆదేశించారు. సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు పునర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని సూచించారు.
పాఠశాలలు, కళాశాలలకు అధ్యాపకులు,సిబ్బంది విధిగా హజరు కావాలని తెలిపారు. పాఠశాలల్లో వివిధ పనులకు అందుబాటులో ఉన్న గ్రామ, మున్సిపల్ నిధుల ను వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో ఆర్సీవో అరుణ కుమారి, జడ్ఈవోడీ రజిని, ప్రిన్సిపాల్ శైలజ, శమంతకమణి, చారి, సిబ్బంది పాల్గొన్నారు.