రామగిరి, డిసెంబర్ 27 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పీజీ కళాశాలల్లో వివిధ కోర్సులకు ఈ నెల 28, 29 తేదీల్లో ప్రారంభం కావాల్సిన సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ మిర్యాల రమేశ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పీజీ కోర్సులు, ఎంబీఏ, ఎంసీఏ, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ సెమిస్టర్-3, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ సెమిస్టర్ 3, 5, 7 పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. తిరిగి ఈ పరీక్షలను సంక్రాంతి అనంతరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా కోర్సుల థియరీ పరీక్షల నిర్వహణ కంటే ముందుగానే విధిగా ప్రాక్టికల్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించారు. థియరీ పరీక్షల నిర్వహణ టైంటేబుల్ను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.