– ఆర్.కే.ఎస్ పౌండేషన్ సభ్యులు
నీలగిరి, మార్చి 21 : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్కేఎస్ పౌండేషన్ సభ్యుడు, నల్లగొండ 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణంరాజు, 8వ వార్డు మాజీ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్, పిల్లి సత్యరాజు అన్నారు. శనివారం పట్టణంలోని ప్రేరణ పాఠశాలలో పౌండేషన్ ఆధ్వర్యంలో యశోద ఆస్పత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ నిరుపేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో యశోద ఆస్పత్రి సహకారంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా యశోద ఆస్పత్రి వైద్యులు’డా.వీరారెడ్డి, చిన్ని, గోపినాధ్, ఉమాదేవి. ఆశోక్రెడ్డి క్యాన్సర్, గుండె, ఎముకలు, స్త్రీల సమస్యలపై పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. సుమారు 600 మంది ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్రెడ్డి, కాలనీవాసులు గంగనబోయిన వెంకన్న, వెంకటచారి, నామ ప్రకాశ్, మామిడాల కృష్ణ, పేరిక వెంకటేశ్వర్లు, ఐతరాజ జానయ్య, జ్యోతి, సింగం రమేశ్ పాల్గొన్నారు.