నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్లో ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు తండోపతండాలుగా తరలివచ్చారు.
దీంతో సభా ప్రాంగణం, బైపాస్ రోడ్లు కిక్కిరిశాయి. పట్టణం, సభ పరిసర ప్రాంతాలు గులాబీ వనాన్ని తలపించాయి. సీఎం కేసీఆర్ ప్రసంగానికి ఈలలు, చప్పట్లతో మద్దతు పలికారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది.