నాంపల్లి, ఆగస్టు 16 : మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతున్నది. నాంపల్లి మండలం పెద్దాపురం ఎంపీటీసీ సప్పిడి రాధికాశ్రీనివాస్రెడ్డి, దేవత్పల్లి ఎంపీటీసీ మంగళవారం జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
మంత్రి గులాబీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు.మరోవైపు మునుగోడు మండలంలోని మునుగోడు, రావిగూడెం, వెల్మకన్నెకు చెందిన దాదాపు 400మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.